మురళీమోహన్ రావు మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల ఆవేదనలను ఎప్పటికప్పుడు పాఠకులకు చేరవేయడంలో పత్రిక నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. ‘కళాభారతి’ పత్రిక భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, పాఠకాదరణ పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
అదేవిధంగా ‘పాలకొండ వెబ్ న్యూస్’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన వార్తలను వేగంగా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. గత నాలుగు నెలల వ్యవధిలో ఈ వెబ్ న్యూస్ను 53,000 మంది వీక్షించడం పత్రిక విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
0 Comments