పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 28న జరగబోయే నిరసన ర్యాలీ కార్యక్రమంనకు సంబంధించిన పోస్టర్ను శాసన మండలి సభ్యులు (MLC) పాలవలస విక్రాంత్, మాజీ శాసనస భ్యురాలు విశ్వాసరాయి కళావతి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం MLC క్యాంపు కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ రౌతు హనుమంతరావు, వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్, కౌన్సిలర్లు వెలమల మన్మధరావు, దుప్పాడ పాపినాయుడు, కిల్లారి మోహన్ రావు, కడగల వెంకటరమణ, పల్లా భాను, ఎంపీటీసీలు కోట అజయ్ బాబు, సాయి, బలగ మన్మథరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments