పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ పట్టణానికి చెందిన ముంజేటి సాయి కీర్తన అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మోర్గాన్ స్టాన్లీలో ఉద్యోగం సంపాదించడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయి కంపెనీ వరకు చేసిన ఈ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.
సాయి కీర్తన తండ్రి ముంజేటి ఈశ్వర్రావు నర్సిపురం గోర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా, తల్లి డాక్టర్ సత్యప్రభ పాలకొండ జూనియర్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు. వీరి కుటుంబం పాలకొండ నీలమ్మ కాలనీలో స్థిర నివాసం ఉండగా, స్వగ్రామం వీరఘట్టం మండలం రేగులపాడు.
సాయి కీర్తన విజయవార్త తెలిసిన వెంటనే రేగులపాడు, పాలకొండ ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. బంధువులు, స్నేహితులు, సహచరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఒక తెలుగు యువతి ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలో స్థానం సంపాదించడం గర్వకారణం. ఇది యువతకు ఒక స్పష్టమైన సందేశం — సంకల్పం, కృషి, పట్టుదల ఉంటే ఏ కల అయినా నిజమవుతుంది. 🌹💐 News by : BSS Prasad

0 Comments