కళాభారతి న్యూస్ & పాలకొండ వెబ్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లా: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరావు ఆదేశాల మేరకు పాలకొండలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. పాలకొండ డి.ఎస్.పి రాంబాబు గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 8 గంటలకు పాలకొండ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ శిబిరం ప్రారంభమవుతుంది.
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి రక్తం లేక ఇబ్బంది పడుతున్న ఎందరో అభాగ్యులకు రక్తాన్ని అందించి, మరొకరికి ప్రాణం పోయాలని కోరారు. సేకరించిన రక్తాన్ని పాలకొండ ఏరియా హాస్పిటల్లోనే ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, రక్తదానం చేసి మరొకరికి జీవం పోయాలని, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని పోలీసులు కోరారు. "రండి, రక్తదానం చేద్దాం, ప్రాణాలు కాపాడుదాం" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. News by BSS Prasad

0 Comments