సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన లలితా మహా త్రిపుర సుందరీ దేవి

 

పాలకొండ వెబ్ న్యూస్ : 29.09.2025 : పాలకొండ పట్టణంలోని నక్కలపేట శ్రీ శిర్డి సాయిబాబా ఆలయంలో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ లలితా మహా త్రిపురసుందరీ దేవి, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్షరాభ్యాసాల కోసం చిన్నారులు తల్లిదండ్రులతో తరలి వచ్చారు. ఆలయ ధర్మకర్త కొండబాబు పర్యవేక్షణలో, ప్రధాన అర్చకులు శరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా,  భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. News by: BSS Prasad 

Post a Comment

0 Comments