అంగరంగ వైభవంగా శ్రీ కోటదుర్గమ్మ శోభాయాత్ర


పాలకొండ, అక్టోబర్ 5 (పాలకొండ వెబ్ న్యూస్):పాలకొండ ప్రజల ఇలవేల్పు, కళింగాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాలు విజయదశమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం తుఫాను కారణంగా జరగకపోవడంతో నేడు ఉత్సవాల ముగింపు సందర్భంగా కోటదుర్గమ్మ తిరువీధి శోభాయాత్ర ఘనంగా జరిగింది.

ఉత్సవానికి డీఎస్పీ ఎం. రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస బ్యాండ్ పార్టీ పొట్లి వారు మధురమైన సంగీతం అందించగా, సాంప్రదాయ బద్ధంగా బల్ల వేషాలు, కోలాటాలు, గిరిజన నృత్యాలు, సాము గరిడీలు, మంగళ వాయిద్యాలు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చాయి.

వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ, అర్చకులు మణీల శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధులలో ఊరేగింపుగా తల్లిని భక్తులు దర్శించుకున్నారు.
ఈ వేడుకను వీక్షించేందుకు పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ పర్యవేక్షణలో, స్థానిక శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ సభ్యులు పల్లా కొండలరావు, గంట సంతోష్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తులు, సమన్వయంతో శోభాయాత్ర విజయవంతంగా ముగిసింది.
News by: BSS Prasad


Post a Comment

0 Comments