నియోజకవర్గాల ప్రస్తుత స్థితిగతులపై జగన్ సమీక్ష: పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మర్యాదపూర్వక భేటీ.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు (MLC) పాలవలస విక్రాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఈ భేటీలో భాగంగా పలు రాజకీయ అంశాలతో పాటు జిల్లాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రధానంగా పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ కార్యకలాపాలపై జగన్ అడిగి తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లోకి వెళ్లాలని విక్రాంత్‌కు దిశానిర్దేశం చేశారు.

.... పాలకొండ వెబ్ న్యూస్ 

Post a Comment

0 Comments