పాలకొండలో తెలుగుదేశం పార్టీ నేతల మర్యాదపూర్వక భేటీ

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 10 ఏప్రిల్, 2026:​పాలకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ పాలకొండ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెన్నపు శ్రీనివాసరావును కలిసి పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా మాజీ కో ఆప్షన్స్ సభ్యులు సుంకరి అనిల్ దత్ మరియు మాజీ కౌన్సిలర్ ప్రతినిధి అడపా బాబ్జిలను కూడా వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ బలోపేతం మరియు స్థానిక అంశాల గురించి ఈ సందర్భంగా నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

​ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రితో పాటు మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మజ్జి జయశంకర్, 1వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి రాంబాబు మరియు పొట్లి మాజీ సర్పంచ్ ప్రతినిధి కర్నేన గణేష్ నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం నాయకులు హనుమంతు రాము, ఎస్ బుజ్జి తదితరులు పాల్గొని నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకలాపాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments