నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ నిర్వహించే సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రీడా సంబరం మొత్తం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. విజేతలకు అందించే బహుమతుల వివరాలను వెల్లడిస్తూ ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 30,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 15,000 రూపాయలు మరియు నాల్గవ బహుమతిగా 10,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, పాలకొండ డివిజన్ స్పోర్ట్స్ ఆర్గనైజర్ నెల్లి వెంకటరమణ, వండాన రాజేంద్ర, ఎన్ని సురేష్ మరియు పలువురు పీడీలు, కోచ్లు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments