దేశ విదేశాల నుంచి విచ్చేసిన సాహితీవేత్తలు, కళాకారులు, పరిశోధకులు, సాంస్కృతిక ప్రముఖుల సమక్షంలో ఈ చిన్నారులు ప్రదర్శించిన కళా ప్రతిభ విశేష ప్రశంసలు అందుకుంది. చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన కళాపరమైన పరిణతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు ప్రముఖులు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిభావంతులైన విద్యార్థినులు పాలకొండలోని శ్రీ శివ కేశవ నృత్య నికేతన్ లో నృత్య గురువు భార్గవ కృష్ణ వద్ద శిక్షణ పొందుతున్నారు. గురువు అందించిన క్రమశిక్షణతో కూడిన శిక్షణ, కళాపట్ల అంకితభావం, విద్యార్థినుల నిరంతర సాధన ఈ విజయానికి బలమైన పునాది అని సాంస్కృతిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. గురు శిష్య సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ప్రదర్శన నిలిచిందని పలువురు కొనియాడారు.
ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల వంటి ప్రతిష్టాత్మక వేదికపై పాలకొండ చిన్నారులులహరి శ్రీ చూడామణి , సౌమ్య , యోగిత ,మరియు చైత్ర
తమ ప్రతిభను ప్రదర్శించడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. తెలుగు కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే క్రమంలో ఇలాంటి యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అత్యంత అవసరమని సభలో పలువురు అభిప్రాయపడ్డారు. తెలుగు సంస్కృతి పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసే ఈ మహాసభల్లో పాలకొండ చిన్నారుల నృత్య విభావరి ప్రత్యేక ముద్ర వేసి, కళాసేవకు వయస్సుతో సంబంధం లేదని మరోసారి చాటిచెప్పింది. వారి ప్రదర్శన తెలుగు నాట్య సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భావితరాల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించే స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచింది.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్
వార్తల కోసం: https://www.palakondawebnews.in
1 Comments
Nice sir
ReplyDelete