ప్రత్యేక పూజలు – కుంకుమార్చనలు:
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం వేళ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సహస్ర నామార్చనలు మరియు విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అంజి బాబు గారి వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.
కిక్కిరిసిన ఆలయాంగణం:
శాకంబరీ అవతారంలో దర్శనమిచ్చిన జగజ్జననిని దర్శించుకునేందుకు పాలకొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయాంగణమంతా భక్తుల నామస్మరణతో మారుమోగింది. పూజా నంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు
0 Comments