ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా డిఎంహెచ్ఓ సూచనల మేరకు, యూపీహెచ్సీ డాక్టర్ సుజియ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యూపీహెచ్సీ పరిధిలోని హెచ్ఈ రమణమ్మ, భువన్, ఎస్టీఎస్, ఆశా కార్యకర్తలు, స్టాఫ్ నర్స్ ట్రైనీలు పాల్గొన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాపిస్తాయని డాక్టర్ రోనాల్డ్ రాస్ గుర్తించిన సందర్భంగా ఈ రోజూ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు భాగస్వామ్యంతో ఊరిని స్వచ్ఛంగా ఉంచాలని కోరారు.
Infirmative news :
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1897 ఆగస్టు 20న బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధి వ్యాప్తిలో దోమల పాత్రను గుర్తించారు. భారతదేశంలో పరిశోధనలు నిర్వహిస్తున్న సమయంలో Anopheles దోమలో మలేరియా పరాన్నజీవిని గుర్తించడం వైద్యరంగంలో కీలకమైన మలుపుగా నిలిచింది.
దోమలు మలేరియాతో పాటు డెంగ్యూ, చికున్గున్యా, జికా, జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చేయగలవు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వృద్ధి పెరుగుతుంది. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, పూల కుండీలు, నీటి తొట్టెల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. దోమల నియంత్రణలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం.
పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూడటం, దోమతెరల వినియోగం వంటి జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చు. దోమల నివారణే ఆరోగ్య రక్షణకు తొలి అడుగు.
0 Comments