భారతదేశాన్ని క్షిపణి సాంకేతికతలో ముందుకు తీసుకెళ్లినందుకు ఆయనకు “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు లభించింది. ఆయన నాయకత్వంలో “అగ్ని”, “పృథ్వీ” క్షిపణులు విజయవంతమయ్యాయి. 2002లో ఆయన భారత రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రజల మనసుల్లో ప్రజాప్రియ అధ్యక్షుడిగా నిలిచారు.
జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, తన కలలను వదలలేదు. “కష్టాలు మన బలాన్ని పెంచుతాయి” అనే ఆయన మాటలు ప్రతి యువకుడికి మార్గదర్శకం. సులభ జీవితం, స్వచ్ఛమైన ఆలోచనలు, దేశాభిమానం ఆయన వ్యక్తిత్వానికి మూలాధారం.
2015లో షిల్లాంగ్లో విద్యార్థులతో మాట్లాడుతూ చివరి శ్వాస విడిచారు. ఆయన జీవితం విద్యార్థులందరికీ ఒక అగ్నిజ్యోతి — కలలు కనండి, కృషి చేయండి, దేశాన్ని గర్వపడేలా చేయండి. అదే కలాం గారికి నిజమైన గౌరవం.
... బి. శివశంకర్ ప్రసాద్
2 Comments
Nice article, inspiration personality for upcoming youth
ReplyDeleteThank you sir
Delete